Skip to main content

Ayushman Bharat: ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?

Modi 650x350

దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగం బలోపేతానికి రూ.64 వేల కోట్లతో చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ ప్రారంభమైంది. అక్టోబర్‌ 25న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసి జిల్లాలోని వారణాసి పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. మరోవైపు వారణాశిలో రూ.5,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది వైద్య కళాశాలలను కూడా ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.

మహమ్మారులను ఎదుర్కోవడానికి...

భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను ఎదుర్కోవడానికి, ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా... నాలుగేళ్లలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టనుంది. 17,788 గ్రామీణ ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాలతోపాటు 11,024 అర్బన్‌ హెల్త్, వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
 

చ‌ద‌వండి: ఏ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్‌ 25
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : వారణాసి, వారణాసి జిల్లా, ఉత్తరప్రదేశ్‌
ఎందుకు : గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Oct 2021 04:04PM

Photo Stories