Skip to main content

Karnataka High Court: ‘హిజాబ్‌’పై ఏర్పాటైన ధర్మాసనానికి ఎవరు సారథ్యం వహిస్తున్నారు?

Hijab-Karnatak High Court

హిజాబ్‌–కాషాయ కండువా గొడవతో కొద్ది రోజులుగా అట్టుడికిన కర్ణాటకలో విద్యా సంస్థల మూసివేత నేపథ్యంలో ఫిబ్రవరి 9న ప్రశాంతత నెలకొంది. దీనిపై విచారణకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్‌ రితురాజ్‌ అవస్థీ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన ఈ ఫుల్‌ బెంచ్‌లో న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణ ఎస్‌.దీక్షిత్, జస్టిస్‌ జేఎం ఖాజీ కూడా ఉంటారు. వివాదంపై ఫిబ్రవరి 8, 9న విచారణ జరిపిన జస్టిస్‌ దీక్షిత్‌ నివేదన మేరకు సీజే ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాక్‌ స్పందించడం సిగ్గుచేటు: భారత్‌

భారత్‌లో దారుణం జరుగుతోందని, హిజాబ్‌ను అనుమతించకపోవడం హక్కుల ఉల్లంఘనేనని పాకిస్తాన్‌ మంత్రులు షా మహమూద్‌ ఖురేషీ, ఫవాద్‌ çహుస్సేన్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ తీవ్రంగా ఖండించారు. దేశ ప్రతిçష్టకు మచ్చ తెచ్చే దురుద్దేశంతోనే కొందరు హిజాబ్‌ గొడవకు మతం రంగు పులిమారని ఆరోపించారు.

చ‌ద‌వండి: ఓఈసీఎమ్‌ గుర్తింపును పొందిన దేశంలోని తొలి పార్కు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
‘హిజాబ్‌’పై ఏర్పాటైన ధర్మాసనానికి ఎవరు సారథ్యం వహిస్తున్నారు?
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు    : కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్‌ రితురాజ్‌ అవస్థీ 
ఎందుకు : హిజాబ్‌–కాషాయ కండువా గొడవపై విచారణ జరిపేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 10 Feb 2022 01:25PM

Photo Stories