Skip to main content

APTEL: విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ పదవికి ఎవరు అర్హులు?

Power

విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఫర్‌ ఎలక్ట్రిసిటీ-ఏపీటీఈఎల్‌) చైర్మన్‌ ఎంపిక కోసం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి.రోహిణితో పాటు కేంద్ర నూతన–పునరుత్పాదక ఇంధన శాఖ, పెట్రోలియం–సహజ వాయువుల శాఖల కార్యదర్శులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. రెండు పేర్లను కమిటీ సిఫార్సు చేస్తుంది. ట్రిబ్యునల్‌ చైర్మన్‌ స్థానంలో కొనసాగిన జస్టిస్‌ మంజులా చెల్లూర్‌ 2021, ఆగస్టు 12న పదవీ విరమణ చేశారు.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు/ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా చేసిన వారే ఈ పదవికి అర్హులు.
 

చ‌ద‌వండి: ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ ర్యాంకు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
ఎప్పుడు  : అక్టోబర్‌ 19 
ఎందుకు : విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఫర్‌ ఎలక్ట్రిసిటీ) చైర్మన్‌ ఎంపిక కోసం...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Oct 2021 06:23PM

Photo Stories