Skip to main content

New Protocol: ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?

postmortem

సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో సాయంత్రం తర్వాత కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే హత్య, ఆత్మహత్య, అత్యాచారం, కుళ్లిపోయిన మృతదేహాలు, అనుమానాస్పద మృతి వంటి కేసుల్లో మాత్రం అనుమతివ్వలేదు. ఈ విషయాన్ని నవంబర్‌ 15న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘బ్రిటిష్‌ కాలం నుంచి ఉన్న విధానానికి ఇప్పుడు తెరపడింది. పోస్టుమార్టం ఇకపై 24 గంటల పాటు నిర్వహించవచ్చు. గుడ్‌ గవర్నెన్స్‌లో భాగంగా.. సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో రాత్రి వేళ కూడా పోస్టుమార్టం చేసుకునేందుకు ఆరోగ్య శాఖ అనుమతిచ్చింది’ అని మంత్రి పేర్కొన్నారు. రాత్రి వేళల్లో నిర్వహించే పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని ఆరోగ్య శాఖ తెలిపింది.

యోధా డయాగ్నొస్టిక్స్‌ సెంటర్‌ ప్రారంభం

హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో యోధా లైఫ్‌లైన్‌ డయాగ్నొస్టిక్స్‌ సెంటర్‌ను ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నవంబర్‌ 17న ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి, తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యరంగంలో సేవలందించే యోధ లైఫ్‌లైన్‌ను అత్యాధునిక కంప్యూటింగ్, మాలిక్యులార్‌ డయాగ్నోస్టిక్స్‌ రంగంలో విశేష అనుభం ఉన్న సుధాకర్‌ కంచర్ల స్థాపించారు.
 

చ‌ద‌వండి: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఎన్నేళ్లకు కేంద్రం పెంచింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సాయంత్రం తర్వాత కూడా పోస్టుమార్టం చేసేందుకు అనుమతి
ఎప్పుడు : నవంబర్‌ 15
ఎవరు    : కేంద్ర ఆరోగ్యశాఖ
ఎక్కడ    : సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో...
ఎందుకు : గుడ్‌ గవర్నెన్స్‌లో భాగంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Nov 2021 06:39PM

Photo Stories