Skip to main content

అయోధ్య దర్మాసనంనుంచి వైదొలిగిన జస్టిస్ లలిత్

అయోధ్య భూ వివాద కేసును విచారించాల్సిన రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యూయూ లలిత్ తనంతట తానుగా వైదొలిగారు.
దీంతో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటుచేసి జనవరి 29న విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు జనవరి 10న ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అయోధ్య ధర్మాసనంలో జస్టిస్ లలిత్‌తో పాటు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అయోధ్య దర్మాసనం నుంచి వైదొలిగిన న్యాయమూర్తి
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : జస్టిస్ యూయూ లలిత్
Published date : 11 Jan 2019 06:10PM

Photo Stories