Skip to main content

ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ ఏఐ ప్రారంభం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(ఐఐటీహెచ్)లో జనవరి 17న బీటెక్ ఏఐను ప్రారంభించారు.
దీంతో ఇంజనీరింగ్ విద్యలో కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ప్రత్యేక బ్రాంచ్‌గా నాలుగేళ్ల బీటెక్ ప్రోగ్రామ్‌ను అందించనున్న తొలి ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐటీహెచ్ నిలిచింది. అంతర్జాతీయంగా మూడో ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపుపొందింది. 2019-20 విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ హెచ్‌లో ఏఐ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం బీటెక్ (ఏఐ) కోర్సును ఎంఐటీ (యూఎస్), కార్నెగీ మిలన్ వర్సిటీ(యూఎస్)లే అందిస్తున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బీటెక్ ఏఐ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 17
ఎక్కడ : ఐఐటీ హైదరాబాద్
Published date : 18 Jan 2019 05:29PM

Photo Stories