Skip to main content

PM Modi, PM Deuba: జయనగర్‌–కుర్తా రైల్వే లైన్‌ను ఏ రెండు దేశాల మధ్య ప్రారంభించారు?

PM Modi-PM Deuba

సరిహద్దు సమస్యను రాజకీయం చేయరాదని భారత్‌–నేపాల్‌ అంగీకారానికి వచ్చాయి. భారత్‌లో పర్యటిస్తున్న నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌ బా ఏప్రిల్‌ 2న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా.. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కూడా చర్చకు వచ్చింది. సమస్య పరిష్కారానికి ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని దేవ్‌ బా కోరారు. రెండు దేశాల సరిహద్దుల్లోని భారత భూభాగాలైన లింపియధురా, కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ నేపాల్‌ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను ప్రచురించడంపై 2020 నుంచి వివాదం నడుస్తోంది.

India-Russia: ప్రధాని మోదీతో రష్యా మంత్రి లావ్రోవ్‌ ఎక్కడ భేటీ అయ్యారు?

మోదీ–దేవ్‌ బా సమావేశం : ముఖ్యాంశాలు

  • బిహార్‌లోని జయ్‌నగర్‌ నుంచి నేపాల్‌లోని కుర్తా మధ్య బ్రాడ్‌గేజ్‌ మార్గంలో నడిచే తొలి ప్యాసింజర్‌ రైలును మోదీ, దేవ్‌బా వర్చువల్‌గా ప్రారంభించారు. విద్యుత్‌ సరఫరా లైన్‌ను, నేపాల్‌లో రూపే చెల్లింపుల వ్యవస్థను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు.
  • రైల్వేలు, విద్యుత్‌ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉద్దేశించిన నాలుగు ఒప్పందాలపైనా సంతకాలు చేశారు.
  • దేవ్‌ బా భారత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. ఐదోసారి పీఎం అయ్యాక ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన.

Jaishankar-Wang Yi: భారత్, చైనా విదేశాంగ మంత్రులు సమావేశం ఎక్కడ జరిగింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
ఎప్పుడు : ఏప్రిల్‌ 2
ఎవరు    : నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌ బా
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : జయనగర్‌–కుర్తా రీజియన్‌ రైల్వే లైన్‌ను ప్రారంభించడంతోపాటు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 04 Apr 2022 03:43PM

Photo Stories