Skip to main content

AP Entrance Exams:మే 15న ఈఏపీసెట్‌.. ఈ ప‌రీక్ష క‌చ్చితంగా పాస్ అయిన వారికి మాత్ర‌మే... ఈసారి వెయిటేజీ ఎంతంటే

ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మే 15వ తేదీ నుంచి ప‌రీక్ష‌లు మొద‌లుకానున్నాయి. మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్‌.. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు.
AP Entrance Exams

అయితే ఈ సారి ఈఏపీసెట్‌కు ఇంట‌ర్మీడియ‌ట్ మార్కుల‌ను క‌ల‌ప‌నున్నారు. 
క‌రోనా రావ‌డంతో...
2020-21, 2021-22 విద్యా సంవ‌త్స‌రాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. దీంతో రెండేళ్లు ఇంటర్మీడియట్‌ మార్కుల వెయిటేజీని తొలగించారు. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయ‌డంతో 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించారు.

చ‌ద‌వండి: ఏపీలో ప‌లు ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల‌...

గతేడాది ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో 70శాతం సిలబస్‌నే విద్యార్థులు చదవ‌డంతో ఈఏపీసెట్‌లోనూ ఆ మేరకే ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించారు.
క‌చ్చితంగా పాస్ కావాల్సిందే....
ఇంటర్మీడియట్‌లోని నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షల్లో విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. గతంలో ఫెయిల్ అయిన‌ వారు, పరీక్ష రాయని విద్యార్థులు కళాశాలల నుంచి పాత హాల్‌ టికెట్లను తీసుకుని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో పాస్‌ కానివారికి ఉత్తీర్ణత సర్టిఫికెట్లు అంద‌జేయ‌రు.

చ‌ద‌వండి: నీట్‌ (యూజీ) నోటిఫికేషన్ విడుద‌ల‌... ఇలా అప్లై చేసుకోండి
25 శాతం వెయిటేజీ...
ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష EAPCETలో ఇంటర్మీడియట్‌ మార్కులకు ఈ సారి 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.

Published date : 09 Mar 2023 01:40PM

Photo Stories