Free Job Training: రేపు జాబ్ మేళా.... ఉచిత శిక్షణ!

రాజాం సిటీ: స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జూలై 2వ తేదీన ఐటీ, నాన్‌ ఐటీ సెక్టార్‌లలో ఉద్యోగాలకు సంబంధించి జాబ్‌మేళా నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్‌ బి.భాస్కరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 28 సంవత్సరాలలోపు ఐటీఐ కోఫా ట్రేడ్‌ పాసైన వారు, ఇంటర్మీడియట్‌, డిగ్రీ పాస్‌, ఫెయిల్‌ అయిన వారు అర్హులని, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసిన వారికి 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు.

పదో తరగతి పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 8326 పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

అనంతరం హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నెలలో గల ఐటీ కంపెనీల్లో ఉద్యోగం కల్పించనున్నారని చెప్పారు. ఒరిజినల్‌, జిరాక్స్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 8121450657, 9573574643 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

#Tags