Skip to main content

AUEET 2024: ఏయూఈఈటీ పరీక్షకు 90.87 శాతం హాజరు.. ఫలితాలు విడుద‌ల తేదీ ఇదే..

ఏయూ క్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కోర్సుల్లో సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏయూ ఈఈటీ 2024 ప్రవేశ పరీక్షకు 90.87 శాతం హాజరు నమోదైందని ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఎ.నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
90 percent attendance for AUEET exam  Entrance Exam Attendance  Andhra University EET 2024 Entrance Exam

పరీక్షకు 4,349 మంది దరఖాస్తు చేయగా, 3,952 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడపలోని ఎనిమిది ప్రాంతీయ కేంద్రాల పరిధిలో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఫలితాలు మే 7వ తేదీన విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. విశాఖలోని పలు పరీక్ష కేంద్రాలను ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌ పరిశీలించారని తెలిపారు. 

చదవండి:

APRCET 2024-25: ప్ర‌శాంతంగా ముగిసిన ఏపీ ఆర్‌సెట్‌.. ఫలితాలు విడుద‌ల తేదీ ఇదే..

NEET 2024: ప్రశాంతంగా ‘నీట్‌’.. ఈసారి కటాఫ్‌ మార్కులు ఇలా..

Published date : 06 May 2024 04:43PM

Photo Stories