Skip to main content

EWS welfare Ministry: ఈడబ్ల్యూఎస్‌ పేరుతో ప్రత్యేక శాఖకు ఏర్పాటు చేయనున్న రాష్ట్రం?

AP Cabinet

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం కోసం ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అక్టోబర్‌ 28న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరికొన్ని మంత్రివర్గ నిర్ణయాలు ఇలా...

  • బ్రాహ్మణ, కాపు, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య తదితర వర్గాల్లో నిరుపేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ శాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయం.
  • జైన్‌లు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జైన్‌ కార్పొరేషన్, సిక్కు  కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • 2021 జనాభా లెక్కల ఆధారంగా బీసీ జన గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టే అధికారాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రికి అప్పగిస్తూ తీర్మానం.

చ‌ద‌వండి: రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు కానున్నాయి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్‌ 28
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం కోసం...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 29 Oct 2021 05:51PM

Photo Stories