Skip to main content

New Bridges: కొన్ని వంద‌ల‌ కోట్లతో కొత్తగా 16 వంతెనలు.. ఎక్కడంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త వంతెనల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది.
State Government Allocates Rs.242.73 Crores for Bridge Projects  16 New Bridges At the Cost of Rs.242 crore in AP   Andhra Pradesh Bridge Construction

మొత్తం రూ.242.73 కోట్లతో 16 కొత్త వంతెనల నిర్మాణ ప్రణాళికను ఆమోదించింది. ఇప్పటికే మొదలైన వంతెనల పనులను పూర్తి చేయడంతోపాటు ఇంకా పనులు మొదలు పెట్టాల్సిన వంతెనల నిర్మాణానికి నిధుల సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. 
కోస్తా జిల్లాల పరిధిలోని ఏడు వంతెనలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు రూ.137.03 కోట్లతోనూ, రాయలసీమ పరిధిలోని 9 వంతెనలను నాబార్డ్‌ నిధులు రూ.105.70 కోట్లతోనూ నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాద­నలకు ఆర్థికశాఖ ఆమోదించడంతో వంతెనల నిర్మాణం వేగవంతం కానుంది.

AP Aarogyasri Scheme: ఏపీలో రూ.25 లక్షల ఉచిత వైద్యం..

Published date : 19 Dec 2023 09:48AM

Photo Stories