Skip to main content

Eastern Ladakh: కె–9 వజ్ర శతఘ్నులను తయారు చేస్తోన్న సంస్థ?

చైనా కవ్వింపు చర్యలతో భారత్‌ అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్‌ దేశం భారీగా సైన్యాన్ని ఆయుధ సంపత్తిని మోహరిస్తుండగా దీటుగా ప్రతిచర్యలు ప్రారంభించింది. లద్దాఖ్‌ సెక్టార్‌లోని ఫార్వర్డ్‌ ప్రాంతాల్లో మొట్టమొదటి కె–9 వజ్ర శతఘ్నులతో కూడిన బలగాలను తరలించింది. ఈ విషయాలను అక్టోబర్‌ 2న సైనిక దళ ప్రధానాధికారి (చీఫ్స్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌) జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే తెలిపారు.

కె–9 వజ్ర విశేషాలు...

  • కె–9 వజ్ర సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ శతఘ్నులకు 50 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఛేదించే శక్తి ఉంది.
  • పర్వతప్రాంతాల్లోనూ కె–9 వజ్ర హొవిట్జర్లు విజయవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షల్లో రుజువైంది.
  • దక్షిణకొరియా తయారీ కె–9 థండర్‌కు దేశీయంగా అభివృద్ధి చేసిన రూపమే కె–9 వజ్ర.
  • ఈ శతఘ్నులను ముంబైకి చెందిన లార్సెన్‌ అండ్‌ టూబ్రో సంస్థ దక్షిణకొరియా సంస్థ భాగస్వామ్యంతో ఉత్పత్తి చేస్తోంది.

3,488 కిలోమీటర్ల మేర...

భారత్‌–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి 3,488 కిలోమీటర్ల మేర వివాదం నడుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌ కూడా తనదేననీ, అది దక్షిణ టిబెట్‌లోని భాగమేనని చైనా వాదిస్తుండగా భారత్‌ ఖండిస్తోంది. 2020 ఏడాది పాంగాంగో సరస్సు ప్రాంతంలో జరిగిన తీవ్ర ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెండు వైపులా వేలాదిగా బలగాలను సరిహద్దుల్లోకి తరలించాయి.

చ‌ద‌వండి: రక్షణ రంగ సాంకేతికత అంశంలో ఒప్పందం చేసుకున్న దేశాలు?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : లద్దాఖ్‌ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి కె–9 వజ్ర శతఘ్నులతో కూడిన బలగాల తరలింపు
ఎప్పుడు : అక్టోబర్‌ 2
ఎవరు    : భారత సైన్యం
ఎందుకు : వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్‌ దేశం చైనా భారీగా సైన్యాన్ని ఆయుధ సంపత్తిని మోహరిస్తుండటంతో...

 

ఇప్పుడే చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌ 

Published date : 04 Oct 2021 01:55PM

Photo Stories