Skip to main content

PM Modi : దివాళీకి ప్రధాని మోదీ గిఫ్ట్ ఇదే.. 75వేల‌ మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ ఏడాది దీపావళికి దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

దివాళీకి రెండు రోజుల ముందు శనివారం వారితో వర్చువల్‌గా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. 

అదే రోజు వారికి ఉద్యోగ నియామక పత్రాలు..
75వేల మంది యువతకు ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అదే రోజు వారికి ఉద్యోగ నియామక పత్రాలు(అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌) అందించనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని స్పెషల్‌ గిఫ్ట్‌ అందుకునే యువత.. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం, సీఐఎస్‌ఎఫ్‌, సీబీఐ, కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో వారికి పోస్టింగ్‌ ఇవ్వనున్నారు.

10 Lac Central Government Jobs : గుడ్‌ న్యూస్‌.. దేశ వ్యాప్తంగా త్వరలోనే 10 లక్షల ఉద్యోగాల భ‌ర్తీకి కీల‌క ఆదేశాలు..

దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి కేంద్ర మంత్రులు సైతం ఈ వర్చువల్‌ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్‌ ఒడిశా నుంచి, ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌సుఖ్‌ మాండవియా గుజరాత్‌ నుంచి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చండీగఢ్‌ నుంచి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మహారాష్ట్ర నుంచి హాజరుకానున్నారు. అలాగే.. ఎంపీలందరూ వారి వారి పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి హాజరుకానున్నారు.

Railway Jobs: తూర్పు రైల్వేలో 3115 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 20 Oct 2022 01:11PM

Photo Stories