UPSC Civils Ranker: ఈయన పోరాటానికి సెల్యూట్ చేయాల్సిందే.. ఎందుకంటే..?
Sakshi Education
సరైన ప్రణాళిక, నిరంతరం కృషి ఉంటే అసాధ్యమనే పదానికి తావే ఉండదు. లక్ష్యం ఏపాటిదైనా కఠినశ్రమను నమ్మి ముందడుగు వేస్తే అపూర్వ విజయాలు అందుకోవచ్చని నిరూపించాడు ఆల్ ఇండియా సివిల్స్ 15వ ర్యాంకర్.. తెలుగు తేజం చల్లపల్లె యశ్వంత్ కుమార్ రెడ్డి.చిన్న వయసులోనే ఐఓసీఎల్లో ఇంజనీర్ ఉద్యోగం.. నెలకు రూ. 90 వేల జీతం.. కానీ అది సంతృప్తినివ్వలేదు. ప్రజలకు నేరుగా సేవచేసేందుకు కదిలాడు. ఏపీపీఎస్సీ గతంలో విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో మూడో ర్యాంకుతో మెరిశాడు. అలాగే 2020లో యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 93వ ర్యాంక్ సాధించాడు.. ఇప్పుడు ఏకంగా ఆల్ ఇండియా సివిల్స్ 15వ ర్యాంక్ సాధించి యువతలో స్ఫూర్తి నింపిన యశ్వంత్ కుమార్ రెడ్డితో.. సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.education.sakshi.com) ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..