Skip to main content

Students Top in Inter Results: ఇంట‌ర్ ఫ‌లితాల్లో జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థులు, గురుకుల బాలిక‌ల‌ స‌త్తా..

ఇంటర్‌ ఫలితాల్లో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు సత్తా చాటాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, గురుకులాలకు చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు.
Top students of junior college and gurukul girls in inter students   Inter toppers from government institutions in Nizamabad Rural

నిజామాబాద్‌ రూరల్‌: ఇంటర్‌ ఫలితాల్లో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు సత్తా చాటాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, గురుకులాలకు చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించారని జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి రవికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నిజామాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో జ్యోతిర్మయి ఎంపీసీలో 1000 మార్కులకు 956 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే బైపీసీలో మలిహ ఆర్ఫీన్‌ 974 మార్కులు, ఒకేషనల్‌లో పూజ 974 మార్కులు సాధించారన్నారు.

Software Employee to Civils Ranker : 32ల‌క్ష‌ల ఉద్యోగం వ‌దులుకుని నేడు సివిల్స్‌లో 231వ ర్యాంకు.. ఇదే లక్ష్యంగా..

అలాగే ఆర్మూర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో సోఫియా కుల్సుం బైపీసీలో 967 మార్కులు, మోర్తాడ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎంపీసీ విద్యార్థిని మనస్విని 932 మార్కులు సాధించారన్నారు. నాగరంలోని మైనారిటీ జూనియర్‌ బాలుర కళాశాలలో ఎంపీసీ, సీఈసీ గ్రూపులో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్‌ తెలిపారు. బైపీసీలో 23 మందికి గానూ 19మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఎంపీసీలో సయ్యద్‌ అర్శలాన్‌ ఎంపీసీ సెకండియర్‌లో 986, బైపీసీలో భార్గవ్‌ 989 మార్కులు సాధించినట్లు తెలిపారు.

గురుకుల బాలికల ప్రతిభ..

డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గురుకుల బాలికల ప్రతిభ కళాశాల (సీవోఈ) ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ మాధవీలత తెలిపారు. టి.లక్కీ ఎంపీసీ సెకండియర్‌లో 992మార్కులు, తోట కీర్తన బైపీసీలో 993 మార్కులు సాధించారన్నారు. అలాగే ఫస్టియర్‌లో అన్విత ఎంపీసీలో 464, శ్రీనిధి బైపీసీలో 433 మార్కులు సాధించారు. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 73 శాతం, ద్వితీయ సంవత్సరంలో 83 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ నళిని తెలిపారు. సీహెచ్‌ సుస్మిత ఎంపీసీ సెకండియర్‌లో 950 మార్కులు, అమూల్య బైపీసీలో 978 మార్కులు సాధించారు. కావ్యకిశోరి ఎంపీసీ ఫస్టియర్‌లో 445, బైపీసీలో నవ్యశ్రీ 414 మార్కులు సాధించారు.

Gurukul Students : ఉత్త‌మ మార్కుల‌తో గురుకుల విద్యార్థినులు..

School Students Summer Holidays: విద్యార్థులకు సమ్మర్‌ హాలిడేస్‌ ఎప్పటినుంచి అంటే..?

ఎంతో గర్వంగా ఉంది...

కాకతీయ కళాశాలలో చదువుతూ ఎంపీసీ ఫస్టియర్‌లో 466 మార్కులు సాధించడం ఎంతో గర్వంగా ఉంది. కళాశాల డైరెక్టర్‌, అధ్యాపకులు ఎంతగానో సహకరించారు. తల్లిదండ్రుల ప్రోత్సహం మరువలేనిది. రెండో సంవత్సరంలో మరిన్ని మార్కులు సాధిస్తాను.

– ఎం.హర్షిత, కాకతీయ కళాశాల

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ..

కాకతీయ కళాశాలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. యజమాన్యం ఎప్పటికప్పుడు ప్రణాళిక బద్దంగా సూచనలు, సలహాలు అందించడం, సందేహాలను నివృత్తి చేశారు. ఇదే ప్రోత్సహంతో ఎంపీసీ సెకండియర్‌లో 991 మార్కులు సాధించగలిగాను.

– త్రిషచౌదరి, కాకతీయ కళాశాల

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Apr 2025 03:04PM

Photo Stories