Telangana Inter Results 2025: కేవలం ఒక్క మార్కు తేడాతో 1.85లక్షల మంది ఫెయిల్..
Sakshi Education
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో కేవలం ఒక్క మార్కు తేడాతో 1.85లక్షల మంది విద్యార్థులు ఫెయిలైనట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. కొందరు ఒక సబ్జెక్టులో, మరికొందరు రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు.
Telangana Inter Results 2025 Out: 1.85 Lakh Students Fail Due to 1 Mark
సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..
ఇదిలా ఉంటే, ఇంటర్లో ఫెయిలైన విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డ్.. సప్లిమెంటరీతో మరో అవకాశం కల్పిస్తుంది. మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్బోర్డు నిన్ననే ప్రకటించింది.
ఈ నెల 23 నుంచి 30 వరకు ఆ పరీక్షలతో పాటు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఇంటర్బోర్డు వెబ్సైట్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలను జూన్ 3 నుంచి ఆరో తేదీ వరకు నిర్వహిస్తారు.