Skip to main content

Govt School Poster Campaign: కార్పొరేట్ స్థాయిలో ప్రచారం చేస్తున్న సర్కారు బడి!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలల తరహాలో పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారాన్ని చేపట్టి, సమీప గ్రామాల్లో తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తున్నారు.
government school admissions poster campaign ashwaraopeta

ఈ ప్రచారంలో భాగంగా, ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ఉచిత నిత్యావసర వస్తువులు, మధ్యాహ్న భోజనం, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉపకార పథకాలు, డిజిటల్ తరగతులు, క్వాలిటీ బోధన తదితర అంశాలను ప్రస్తావిస్తూ కరపత్రాలు ముద్రించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం కలిసి చేస్తున్న ఈ "సర్కారు బడికి పోస్టర్ ప్రచారం" గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందనను పొందుతోంది.

government school admissions poster campaign ashwaraopeta

చదవండి: Bhagavad Gita: భ‌గ‌వ‌ద్గీత‌కు యునెస్కో ప్ర‌తిష్టాత్మ‌క గుర్తింపు!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Apr 2025 06:11PM

Photo Stories