Skip to main content

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు వీడియో పాఠాలు

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్, ఇతర కారణాలతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్న నేపథ్యంలో వారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అనేక వినూత్న కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
విద్యార్థులు ఆన్‌లైన్ వేదికల ద్వారా తమ అభ్యసన కార్యక్రమాలను కొనసాగించేలా విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా వీటిని అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో మరిన్ని కార్యక్రమాలకు ఎస్‌సీఈఆర్‌టీ శ్రీకారం చుట్టింది.
  • వివిధ తరగతుల పాఠ్యాంశాల బోధనపై ఎస్‌సీఈఆర్‌టీ వీడియోలను తయారుచేయిస్తోంది.
  • సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా వీడియో పాఠ్యాంశాలు రూపొందించనుంది.
  • ఈ వీడియో పాఠ్యాంశాలను విద్యాశాఖ ఏర్పాటుచేసే గూగుల్ లింక్‌కు యాడ్ చేస్తారు.
  • ఉపాధ్యాయులు తమ ఫోన్ల ద్వారా కూడా పాఠాలు చెప్పి వాటిని ఎడిట్ చేసి పంపించవచ్చు.
  • 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం ఇటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
  • ఆసక్తి ఉన్న టీచర్లకు మార్గదర్శనం చేస్తున్నారు.
  • దీనివల్ల పిల్లలు పాఠశాలలకు రాలేకపోయినా వీడియో పాఠాల ద్వారా అంశాలను నేర్చుకోగలుగుతారు.
Published date : 13 May 2020 03:29PM

Photo Stories