Skip to main content

10th Class toppers News: 10వ తరగతి టాపర్స్‌కు విమానం ఎక్కే అవకాశం

10th Class toppers News
10th Class toppers News

బెళుగుప్ప: పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి మండల స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన ఐదుగురు విద్యార్థులకు విమానం ఎక్కే అవకాశం దక్కింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఎంఈఓ మల్లారెడ్డి తన సొంత నిధులతో విమానయాన అవకాశం కల్పిస్తానని గతంలోనే హామీ ఇచ్చారు.

DOST 2025-26 Notification Released: Click Here

ఈ మేరకు మండల టాపర్స్‌గా నిలిచిన వై.ఈశ్వరి (574), టీ.మధుశ్రీ (568), జీ.ఫౌజియా (563), సి.లావణ్య (560), కె.అర్చన (556)లను బెంగళూరు నుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకువెళ్లి అక్కడ పర్యాటక ప్రాంతాలను చూపించనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రే ఎంఈఓ మల్లారెడ్డి విద్యార్థులను తీసుకుని బెంగళూరుకు వెళ్లారు. అంతకుముందు ఆయన మండల టాపర్స్‌తో కలిసి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ డీఈఓ కృష్టయ్యలను కలిశారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యం, సాధించిన మార్కులను వివరించారు. కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ విద్యార్థులను అభినందించారు.

Published date : 03 May 2025 08:37AM

Photo Stories