Skip to main content

Breaking News: సివిల్స్‌-2020 ఫలితాలు విడుదల..ఎంపికైన అభ్య‌ర్థుల వివ‌రాలు ఇవే..

న్యూఢిల్లీ: సివిల్స్‌-2020 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సెప్టెంబ‌ర్ 24వ తేదీన (శుక్రవారం) విడుదల చేసింది.

మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్‌, 229 ఓబీసీ, 122 ఎస్సీ, 61 ఎస్టీ, 86 మంది ఈడబ్య్లూఎస్‌ కేటగిరి అభ్యర్థులు ఎంపికయ్యారు.

మొదటి ర్యాంకును..
ఐఐటీ బాంబే నుంచి బీటెక్‌(సివిల్‌ ఇంజనీరింగ్‌) చేసిన శుభం కుమార్‌కు మొదటి ర్యాంకు రాగా,  బీటెక్‌లో ఎలక్రికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన జాగృతి అవస్తికి రెండో ర్యాంకు వచ్చింది. మహిళల విభాగంలో అవస్తి టాపర్‌గా నిలవడం విశేషం.

సత్తా చాటిన తెలుగు విద్యార్థులు..
► పి. శ్రీజకు 20వ ర్యాంకు
►మైత్రేయి నాయుడుకు 27వ ర్యాంకు
►జగత్‌ సాయికి 32వ ర్యాంకు
►దేవగుడి మౌనికకు(కడప) 75వ ర్యాంకు
►రవి కుమార్‌కు 84వ ర్యాంకు
►యశ్వంత్‌ కుమార్‌ రెడ్డికి 93వ ర్యాంకు

 

సివిల్స్‌-2020 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

Published date : 24 Sep 2021 07:45PM
PDF

Photo Stories