Skip to main content

ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో ఐదో తరగతి, బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)..
2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి, ఆరు నుంచి తొమ్మిది తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

ఐదో తరగతి ప్రవేశాలు: మొత్తం సీట్ల సంఖ్య: అన్ని జిల్లాల్లో కలిపి 2480.

ఆరు నుంచి తొమ్మిది తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు: మొత్తం సీట్లు తరగతుల వారీగా: ఆరో తరగతి–582, ఏడో తరగతి–135, ఎనిమిదో తరగతి–121, తొమ్మిదో తరగతి–145.

మీడియం: ఇంగ్లిష్‌
అర్హత: ఆయా తరగతిలో ప్రవేశాలను అనుసరించి ప్రభుత్వ/గుర్తింపు పొంది పాఠశాలల్లో వరుసగా నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దర ఖాస్తు ప్రారంభ తేది: 25.06.2021

దరఖాస్తులకు చివరి తేది: 10.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://aptwgurukulam.ap.gov.in/

Photo Stories