Skip to main content

టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్, అశోక్‌నగర్‌లో డిగ్రీ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేది మే 09..

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లాకు చెందిన అశోక్‌నగర్‌లో టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌–తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ మెన్‌ (టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌).. 2021–22 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు బాలురు నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: బీఎస్సీ(ఎంపీసీ), బీఏ(హెచ్‌ఈపీ)
అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణులైన/ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో రూ.రెండు లక్షలు, గ్రామాల్లో లక్షా యాభైవేల రూపాయలు మించకూడదు.
వయసు: 01.07.2021 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, సైకో అనలైటికల్‌ టెస్ట్, మెడికల్‌ టెస్టులు, లెక్చర్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: రాత పరీక్షను 100మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిఫుల్‌ ఛాయిస్‌ రూపంలో ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://tgtwgurukulam.telangana.gov.in/  and
www.ttwrdcs.ac.in

Tags

Photo Stories