Skip to main content

NEET UG 2025 : ఈ 72 ఏళ్ల పెద్దావిడ.. నీట్ ఎగ్జామ్ రాశారిలా.. కానీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశ‌వ్యాప్తంగా మే 4వ తేదీ (ఆదివారం) National Eligibility Cum Entrance Test (NEET UG)-2025 జ‌రిగిన విష‌యం తెల్సిందే. అయితే నిన్న జ‌రిగిన ఈ నీట్ యూజీ-2025 ప‌రీక్ష‌లో ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చోటు చేసుకుంది.
72 old women venkata lakshmi wrote neet 2025   72-year-old woman takes NEET UG 2025 exam, proving age is not a barrier to education

ఏకంగా 72 ఏళ్ల వయసున్న పెద్దావిడ సైతం నీట్ ఎంట్రన్స్ టెస్టు 2025 రాసి అందరిని ఆశ్చర్యానికి లోను చేశారు. చదువుకు వయసు అడ్డంకి కాదని, ఆ తల్లి, ఓ పెద్దావిడ నిరూపిస్తున్నారంటూ వీరిని ప్రశంసిస్తున్నారు.

చాలా ప్రశాంతంగా..
ఆమె పేరు పోతుల వెంకటలక్ష్మి. ఈమె ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన నీట్ ఎగ్జామ్ రాశారు. ఏడు పదుల వయసు వెంకటలక్ష్మీ ప‌రీక్ష రాసే టైమ్‌లో చాలా ప్రశాంతంగా కనిపించారు.

➤☛ NEET UG 2025:NEET UG 2025 పరీక్ష విశ్లేషణ .....ఫిజిక్స్ ప్రశ్నలు చాలా కఠినం

చదువుకు వయసు అడ్డంకి కాదని...
ఎవరో ఎగ్జామర్ రాయడానికి వస్తే, వారి వెంట వెంకటలక్ష్మీ వచ్చారని మొదట ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు, గేట్ వద్ద సిబ్బంది భావించారు. కానీ హాల్ టికెట్, ఐడీ కార్డు చూపించి ఎగ్జామ్ రాసేందుకు వచ్చానని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు.  హాల్ టికెట్ ఎగ్జామ్ కు కావాల్సిన పెన్ను, పెన్సిల్ లాంటి వాటిని తీసుకుని కాకినాడలోని పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్ కు ఆమె వచ్చారు. తన మనవడినో, మనవరాలికో ఆల్ ద బెస్ట్ చెప్పేందుకు వచ్చారని భావించిన వారు విషయం తెలిసి ప్రశంసించారు. చదువుకు వయసు అడ్డంకి కాదని ఆ పెద్దావిడ నిరూపిస్తున్నారు. ఏదైనా సాధించాలన్న ఆలోచన, ఆశయం ఉంటే ఏ వయసులోనైనా వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించవచ్చునని ఆమెను చూసిన వారు అంటున్నారు.

Published date : 05 May 2025 03:22PM

Photo Stories