Skip to main content

NEET PG 2025 Applications : నేటి నుంచి నీట్ పీజీ 2025 ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. ఇలా ద‌ర‌ఖాస్తులు చేసుకోండి..

నీట్ పీజీ 2025 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ మెర‌కు విద్యార్థులు వారి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు అధికారులు.
NEET PG 2025 Important Dates and Guidelines   Application process and important dates for neet pg 2025 exam  NEET PG 2025 Notification Released

సాక్షి ఎడ్యుకేష‌న్‌: నీట్ పీజీ 2025 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ మెర‌కు విద్యార్థులు వారి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు అధికారులు. ఎన్‌బీఈ.. నేష‌నల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్, విద్యార్థులు natboard.edu.in. త‌మ‌ వెబ్‌సైట్ నుంచి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌ను కొన‌సాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక‌, విద్యార్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకునే ముందు ముఖ్య‌తేదీలు, విధానం, ప‌రీక్ష త‌దిత‌ర వివ‌రాల‌ను కూడా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. కింద ఇచ్చిన‌ వివ‌రాలను ప‌రిశీలించండి..

ఇక‌, నేటి నుంచి అంటే, ఏప్రిల్ 17వ తేదీ నుంచే.. నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్ (ఎన్‌బీఈ) నీట్ పీజీ విద్య‌కు సంబంధించి విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది.

TG Summer Holidays 2025 : గుడ్ న్యూస్‌.. పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్రారంభం.. ఈ తేదీల్లోనే

విద్యార్థులు, పీజీ విద్య కోసం ఏటా నిర్వ‌హించే నీట్ పీజీ 2025.. నేష‌నల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్ పోస్ట్ గ్రాడ్యువేష‌న్ 2025లో ఉత్తీర్ణ‌త సాధించి, ఎండీ, ఎంఎస్ వంటి కోర్సుల్లో ప్ర‌వేశం పొందుతారు. దీని కోసం, ప్ర‌స్తుతం ద‌ర‌ఖాస్తులు కొన‌సాగుతోంది.

ద‌ర‌ఖాస్తుల విధానం..

1. మొద‌ట‌, ఎన్‌బీఈ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.. nbe.edu.in
2. ముందుగా విద్యార్థులు రిజిస్టర్ అవ్వండి. ఆ త‌రువాత లాగిన్ వివ‌రాల‌తో ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌ను ప్రారంభించండి. 
3. అక్క‌డ క‌నిపిస్తున్న నీట్ పీజీ లింక్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు, అప్లికేష‌న్ లింక్‌పై క్లిక్ చేసి, కావాల్సిన వివ‌రాల‌ను న‌మోదు చేయండి.

Self Employment Scheme : 6 ఏళ్ల త‌రువాత స్వ‌యం ఉపాధి ప‌థ‌కం.. ద‌ర‌ఖాస్తుల్లో ఇబ్బందులు.. కార‌ణం!!

4. నియ‌మించిన ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ను న‌మోదు చేసి, వ‌చ్చిన అప్లికేష‌న్ ఫార్మ్‌ను పూరించండి. (ద‌ర‌ఖాస్తు రుసుము కూడా)
5. మ‌రోసారి పూర్తి వివ‌రాల‌ను ప‌రిశీలించుకోండి, త‌రువాత స‌బ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి. వ‌చ్చిన అప్లికేష‌న్ ఫార్మ్‌ను ప్రింట్ తీసుకోండి.

చివ‌రి తేదీ:

నేటి నుంచి ప్రారంభమైన నీట్ పీజీ 2025 ద‌ర‌ఖాస్తులను విద్యార్థులు త్వ‌రగా పూర్తి చేసుకోవాల‌ని అధికారులు సూచించారు. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న విద్యార్థులు వ‌చ్చే నెల, మే 7వ తేదీలోగా త‌మ ద‌ర‌ఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వెనువెంట‌నే ద‌ర‌ఖాస్తులు చేసుకోకుండా, విద్యార్థులు మొద‌ట త‌మ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసుకోవ‌చ్చ‌ని సూచించారు అధికారులు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 18 Apr 2025 10:56AM

Photo Stories