Skip to main content

యూజీసీ-నెట్ జూన్-2020

సాక్షి, ఎడ్యుకేషన్:నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) యూజీసీ నెట్ పరీక్ష జూన్ 15 నుంచి 20 వరకు జరగాల్సి ఉంది.
కానీ కరోనా (కోవిడ్-19) లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో పరీక్ష తేదీని తర్వాత ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ-నెట్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియను మార్చి 16న ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ గడువు తేదీని మే 15కు పొడిగించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఎన్‌టీఏ యూజీసీ-నెట్ పరీక్షను నిర్వహిస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మూడు గంటల కాలవ్యవధిలో పరీక్ష జరుగుతుంది.
Published date : 13 May 2020 03:53PM

Photo Stories