వివిధ పరీక్షల దరఖాస్తు గడువు తేదీలు పొడిగింపు: ఎన్టీఏ
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: కరోనా(కోవిడ్-19) లాక్డౌన్ కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. వివిధ పరీక్షల ఆన్లైన్ ద రఖాస్తుల గడువును పొడిగించింది.

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ జేఈఈ-2020, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) పీహెచ్డీ ప్రవేశ పరీక్ష-2020, ఓపెన్మ్యాట్ (ఎంబీఏ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్) ఏఐఈఈఏ-2020, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (జెఎన్యూఈఈ)-2020ల, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2020 దరఖాస్తులకు చివరి తేదీని మే 15, 2020కు పొడిగించింది. అలాగే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) జూన్ 2020కు దరఖాస్తులకు చివరి తేది మే 16. కాగా ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్కు దరఖాస్తులకు చివరి తేది (ఏఐఏపీజీఈటీ)-జూన్ 5, 2020కు పొడిగించింది.
Published date : 07 May 2020 03:49PM