సీపీజీఈటీ రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని కళాశాలల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) రెండో విడత కౌన్సెలింగ్లో 13,290 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
జాబితాను ప్రకటించినట్లు సీపీజీఈటీ కన్వినర్ ప్రొ.కిషన్ శనివారం తెలిపారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఈ నెల 12 వరకు ఫీజు చెల్లించాలన్నారు. మొత్తం 39,009 సీట్లలో 2 కౌన్సెలింగ్ల ద్వారా 27,224 సీట్లను కేటాయించగా.. ప్రైవేటు కాలేజీల్లో 11,785 మిగిలాయ న్నారు. సీట్లు పొందిన వారు ఆయా కళాశాలల్లో ఈ నెల 15 వరకు ఒరిజినల్ టీసీ సమర్పించాలని చెప్పారు. 16 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు.
Published date : 08 Mar 2021 03:38PM