Skip to main content

‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్’లో కొత్త సవరణలు ఇవే..

సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ:దేశంలో పరిశోధనలను మరింతగా ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్‌లో పలు సవరణలు చేసినట్లు రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మే 7వ తేదీన వెల్లడించారు.
ఈ ఫెలోషిప్ పొందడానికి అవసరమైన నిర్దేశిత గేట్ స్కోర్ తగ్గించినట్లు పేర్కొన్నారు. దీన్ని 750 నుంచి 650కి తగ్గినట్లు స్పష్టం చేశారు. అలాగే లేటరల్ ఎంట్రీ అనే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. పీఎంఆర్‌ఎఫ్ అనుమతి పొందిన విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ చేస్తున్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్ కోసం లేటరల్ ఎంట్రీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
Published date : 08 May 2020 02:19PM

Photo Stories