పాఠశాలలు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక..
Sakshi Education
సాక్షి, తాడేపల్లి : మన పాలన- మీ సూచన కార్యక్రమంలో భాగంగా మే 27న విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ..ఏవైనా కొత్త మార్పులు చేసేటప్పుడు మొదట్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఇంగ్లిష్ మీడియానికి సంబంధించి కూడా చిన్న, చిన్న సమస్యలు ఎదురయ్యాయి. వీటిని అధిగమించడానికి ఆంగ్ల బోధనకు సంబంధించి టీచర్లకు శిక్షణ ఇస్తున్నాం. పేదవాళ్ల పిల్లలు ఇంగ్లిష్లో మాట్లాడే పరిస్థితి రావాలి. కోవిడ్ కారణంగా ఆగస్టు 3 నుంచి పాఠశాలలు తెరుస్తున్నాం. పాఠశాలలు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక ఇస్తాం. జగనన్న విద్యాకానుకలో యూనిఫాం, బుక్స్, షూలు, బెల్ట్, బ్యాగ్ అందిస్తాం. మధ్యాహ్న భోజనం పెట్టే ఆయాలకు రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచాం. సరుకుల బిల్లులతోపాటు ఆయాల జీతాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తాం. పిల్లలకు పౌష్టికాహారం అందేలా మెనూ రూపొందించాం అని తెలిపారు.
Published date : 27 May 2020 03:26PM