పాలిసెట్-2020 ర్యాంకులతోనే డిప్లొమా ప్రవేశాలు
Sakshi Education
రాజేంద్రనగర్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్లను పాలిసెట్-2020 ర్యాంకుల ఆధారంగా జరపనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్కుమార్ వెల్లడించారు.

ఈ మేరకు మే 12న ఒక ప్రకటనను విడుదల చేశారు. పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి మే 31వ తేదీ ఆఖరు గడువని, ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ వివిధ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ప్రత్యేకంగా అడ్మిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసిందని రిజిస్ట్రార్ వెల్లడించారు. పాలిసెట్-2020 పరీక్ష ఫలితాలు వెల్లడించిన తరువాత ఆసక్తి గల అభ్యర్థులు విశ్వవిద్యాలయ అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకారంగా విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి అభ్యర్థులు కనీసం 4 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాలలో చదివి ఉండాలని, పాలిసెట్ ర్యాంకు లేకపోతే విశ్వవిద్యాలయ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉండదని తెలిపారు. మరిన్ని వివరాలకు www.polycetts.nic.in, www.sbtet.telangana.gov.in లో చూడాలని కోరారు.
Published date : 13 May 2020 03:43PM