Skip to main content

ఓలాలో 1400 మంది ఉద్యోగులు ఔట్‌

సాక్షి, ముంబై: ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా కూడా ఉద్యోగులను తొలగింపునకు నిర్ణయించింది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత రెండు నెలల్లో ఆదాయం 95 శాతం క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఓలా రైడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ బిజినెస్ నుంచి 1,400 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో ఓలా సీఈఓ భవష్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Published date : 20 May 2020 05:20PM

Photo Stories