మే 24 తర్వాత బిట్శాట్-2020
Sakshi Education
సాక్షి,ఎడ్యుకేషన్:కరోనా (కోవిడ్-19) లాక్డౌన్ కొనసాగుతున్న కారణంగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పరీక్ష తేదీని పొడిగించింది.

బిట్శాట్ పరీక్షను వివిధ క్యాంపస్లలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇంతకు ముందు బిట్శాట్ 2020 పరీక్ష మే 16 నుంచి 25 మధ్య జరగాల్సి ఉండగా.. ఇప్పుడు మే 24 తర్వాత జరగనుంది. కొత్త పరీక్ష తేదీలు, ప్రవేశాల షెడ్యూల్కు సంబంధించిన సమాచారం కోసం వెబ్సైట్: www.bitsadmission.com చూడొచ్చు.
Published date : 07 May 2020 03:55PM