జూలై 1 నుంచి 10, 12తరగతుల పరీక్షలు
Sakshi Education
న్యూఢిల్లీ: పెండింగ్లో ఉన్న 10, 12 తరగతుల పరీక్షలు జూలై 1 నుంచి 14 వరకూ జరగుతాయని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) శుక్రవారం స్పష్టంచేసింది.

12వ తరగతి పరీక్షలు జూలై 2 నుంచి 12 వరకూ, 10వ తరగతి పరీక్షలు జూలై 1 నుంచి 14 వరకూ జరుగుతాయని తెలిపింది. పరీక్షకు వచ్చే విద్యార్థులు శానిటైజర్ బాటిళ్లు, మాస్కులు తప్పనిసరిగా తెచ్చుకోవాలని, చేతి తొడుగులు ఐచ్ఛికమని సీఐఎస్సీఈ కార్యదర్శి గెర్రీ అరాథూన్ వెల్లడించారు. పరీక్ష సెంటర్ల వద్ద భౌతిక దూరం పాటించేలా పాఠశాలలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పదో తరగతి పరీక్షల్లో 6 పేపర్లు,12 వ తరగతి పరీక్షల్లో 8 సబ్జెక్టులు ఉంటాయి.
Published date : 23 May 2020 02:54PM