ఇంటి నుంచే ‘ఎల్పీయూ నెస్ట్’ రాసే అవకాశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) లో పలు కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘ఎల్పీయూ నెస్ట్’ ఎంట్రన్ ్స పరీక్షకు విద్యార్థులు ఇంటి నుంచే హాజరయ్యే అవకాశాన్ని ఎల్పీయూ కల్పించింది.

ఏటా వేల మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షను దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో ఆన్ లైన్ ద్వారా ఎంట్రన్స్ పరీక్ష జరుగుతుంది. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షను మే నెలకు వాయిదావేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న కారణంగా ఈ ఎంట్రన్ ్సను పరీక్ష కేంద్రాల్లో కాకుండా విద్యార్థులు తమ ఇంటి నుంచే హాజరయ్యే వెసులుబాటును కల్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షకు హాజరయ్యే అవకాశముంటుందని తెలిపారు. అలాగే విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో ఎలాంటి తప్పుడు కార్యకలాపాలకు పాల్పడరాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స (ఏఐ) అనే టూల్ ద్వారా వారిపై గట్టి నిఘా ఉంటుందని వెల్లడించారు.
Published date : 19 May 2020 03:18PM