Skip to main content

ఈ జోన్లలో పరీక్ష కేంద్రాలు వద్దు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బోర్డులు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ నిర్వహించే పదో తరగతి, 12వ తరగతి పరీక్షా కేంద్రాలను కంటైన్‌మెంట్ జోన్లలో ఏర్పాటు చేయవద్దని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
ఈ మేరకు మే 20న అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చామని, అయితే వాటి నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇవీ నిబంధనలు..
  • పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బంది, టీచర్లు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి.
  • పరీక్ష కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి. సెంటర్లను శానిటైజ్ చేయాలి. పరీక్ష కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలి.
  • వేర్వేరు బోర్డు పరీక్షలు ఒకే రోజు ఉండకుండా చూసుకోవాలి.
  • విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చేలా ప్రత్యేక బస్సులను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి.
Published date : 21 May 2020 02:28PM

Photo Stories