హెచ్సీయూ అడ్మిషన్ల గడువు జూన్ 30 వరకు పెంపు
Sakshi Education
రాయదుర్గం (హైదరాబాద్): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తుల గడువు తేదీ మరోసారి పొడిగించారు.

జూన్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు హెచ్సీయూ పీఆర్ఓ ఆశిష్ జాకబ్ థామస్ శుక్రవారం తెలిపారు. ప్రవేశ పరీక్షల ద్వారా కల్పించే అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో ఈ నెల 22 వరకు గడువు ఉండగా.. తాజాగా దీన్ని పొడిగించారు. 2020-21 విద్యా సంవత్సరంలో 132 కోర్సుల్లో 2,456 సీట్లు ఉన్నాయి. అందులో 16 ఇంటిట్రేటెడ్ కోర్సులు, 41 పీజీ కోర్సులు, 15 ఎంఫిల్, 10 ఎంటెక్, 46 పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ http://www.acad.uohyd.ac.in/ ను సందర్శించాలని సూచించారు.
Published date : 23 May 2020 02:47PM