Skip to main content

ఎస్వీయూ పీజీ పరీక్షలు వాయిదా

యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఎస్వీయూలో సెప్టెంబర్ 7 నుంచి నిర్వహించాల్సిన పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు.
కోవిడ్ కేసులు తగ్గకపోవడం, వసతి గృహాలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా వారి వారి సమీప ప్రాంతాల్లోనే పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం అందించారు.
Published date : 29 Aug 2020 03:13PM

Photo Stories