బోధనా మాధ్యమంపై ఎన్డీటీవీ ద్వారా ఒపీనియన్ పోల్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా మాధ్యమం ఏది ఉండాలన్న దానిపై జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఎన్డీటీవీ (న్యూఢిల్లీ) ద్వారా ఒపీనియన్ పోల్ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బి.రాజ శేఖర్ మే 21 (గురువారఏ)న ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఒపీ నియన్ పోల్తో పాటు ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాలపై ఏడు షార్ట్ ఫీచర్ ఫిల్ములు కూడా ఈ సంస్థ ద్వారా నిర్మించనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలపై విసృ్తత ప్రచారానికి వీలుగా ఈ షార్ట్ ఫిల్మ్ల నిర్మాణం జరగనుంది.
Published date : 22 May 2020 02:36PM