ఆగస్టు 3 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం..విద్యార్థులకు ఇవి తప్పనిసరి
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనా, లాక్డౌన్తో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.

2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి స్కూళ్లను ఆగస్టు 3నుంచి ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన నేపథ్యంలో విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
వీటిలో ముఖ్యమైనవి ఇవీ..
వీటిలో ముఖ్యమైనవి ఇవీ..
- స్కూళ్లు పునఃప్రారంభించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ అనుసరించాలి. కోవిడ్-19 ప్రభావం పిల్లల మానసిక, శారీరక పరిస్థితిపై పడకుండా జాగ్రత్తపడాలి.
- స్కూళ్ల ప్రధాన గేట్ మొదలుకొని అన్నిటిని పూర్తిగా డిస్ ఇన్ఫెక్ట్ చేయాలి.
- విద్యార్థులు లోపలకు వచ్చేముందు శారీరక ఉష్ణోగ్రత పరిశీలించాలి.
- ప్రవేశ ప్రదేశంలోనే ప్రతి 30 మంది విద్యార్థులకు చేతులు శుభ్రం చేసుకొనేందుకు రెండు ఆటోమేటెడ్ హేండ్ వాష్ కేంద్రాలుపెట్టాలి.
- విద్యార్థులు, టీచర్లకు వాష్బుల్ మాస్కులు అందించాలి.హేండ్ కర్చీఫ్లు తప్పనిసరి.
- మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో పాల్గొనే టీచర్లు, సిబ్బంది మాస్కులు, గ్లౌజ్లను వాడటం తప్పనిసరి.
- ఉదయం ఆరు బయట అసెంబ్లీని రద్దుచేసి తరగతి గదుల్లో స్పీకర్ల ద్వారా నిర్వహించాలి.
- 30 మంది మాత్రమే ఉండే స్కూళ్లలో గదికి 15 మంది చొప్పున ఉదయం 8 నుంచి 12 వరకే తరగతులు నిర్వహించాలి.
- తరగతికి 30 మందికన్నా ఎక్కువ మంది విద్యార్థులుంటే ఉదయం 8 నుంచి 12.30 వరకు ఒక షిఫ్టు, ఆ తరువాత 12.30 నుంచి 4.30 వరకు రెండో షిఫ్టు నిర్వహించాలి.
- 50 నుంచి 100 మంది ఉంటే రెండు బ్యాచ్లుగా రోజు విడిచి రోజు స్కూలు నడపాలి.
- ఇంటిదగ్గర అభ్యసించేందుకు వర్కుబుక్లు అందించాలి.
- నీరు తాగేందుకు, భోజనానికి 10 మంది చొప్పున క్యూలో వెళ్లేలా గంట మోగించాలి.
- ప్రతి రోజూ కరోనా జాగ్రత్తలపై విద్యార్థులకు 15 నిమిషాలు వివరించి వారి సమీప ప్రాంతాల్లో కోవిడ్ కేసులున్నాయేమో తెలుసుకోవాలి.
- యోగాను ఎవరికి వారు చేసేలా బోధించాలి.
- పరీక్షల సమయంలో హాల్కు 10 మంది మాత్రమే ఉండేలా చూడాలి.
- కోవిడ్ లక్షణాలు కనిపించే పిల్లలను ప్రత్యేక ఐసోలేషన్ గదులలో పరీక్ష రాయించాలి. వాటిని పరీక్షకు ముందు, తరువాత డిస్ ఇన్ఫెక్ట్ చేయించాలి.
Published date : 20 May 2020 05:10PM