Skip to main content

వైద్య విద్యా కోర్సుల ఫీజులపై త్వరలో నివేదిక

సాక్షి, అమరావతి: వైద్యవిద్యా కోర్సులకు ఆయా కాలేజీల వారీగా ఫీజులను నిర్ణయించి ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందిస్తామని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య చెప్పారు.
ఫీజులపై ఆయా కాలేజీల యాజమన్యాల వాదనలు వినడం పూర్తయింది. ఆయా కాలేజీలు అందించిన ప్రతి పాదనలు, అన్ని పత్రాలను నిపుణులతో పరిశీలింపచేసిన కమిషన్ యాజమాన్యాల అభిప్రాయాలను కూడా తీసుకుంది.
Published date : 22 May 2020 02:35PM

Photo Stories