నా సేవలు నా దేశానికే అంకితం : డాక్టర్ దివ్యాసింగ్
Sakshi Education
దేశాన్ని రక్షించడానికి సైనికులు తమ జీవితాలను ధారపోసినట్లు ఇప్పుడు కరోనా పేషెంట్లకు సేవ చేయడానికి డాక్టర్లు తమ ఆరోగ్యాలను ఫణంగా పెడుతున్నారు.

‘భారత్లో మెడిసిన్ చదివి భారతీయులకు సేవ చేయకపోతే ఎలా’ అని డాక్టర్ దివ్యాసింగ్... ఇండియాకి వచ్చి కరోనాపై పోరాటం చేస్తున్నారు.
పేషెంట్లు ఉన్నారు డాక్టర్లు లేరు..
డాక్టర్ దివ్యాసింగ్ మెడిసిన్ పూర్తికాగానే భర్తతో పాటు ఆఫ్రికాకు వెళ్లిపోయారు. ఆమె భర్త ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి. ఆమె ఆఫ్రికాకు వెళ్లిన మూడు నెలలకే కరోనా విలయతాండవం మొదలైంది. మనదేశంలో అవసరమైనంత మంది వైద్యులు లేరు. ఇక్కడ కోట్లాదిమంది ఆందోళనలో రోజులు గడుపుతుంటే తనకు ఏ మాత్రం పట్టనట్లు ఆఫ్రికాలో ఉండిపోవడానికి ఆమె మనస్సు అంగీకరించలేదు. మార్చి మొదటి వారంలోనే (అప్పటికి ఇంకా లాక్డౌన్ ప్రకటించలేదు, విదేశీ విమానాలు ఆగిపోలేదు) ప్రమాదాన్ని అంచనా వేసి ఇండియాకి వచ్చేశారు. ముంబయిలోని వర్లి, ధారవి ప్రదేశాల మీద దృష్టి పెట్టారు.
ఇంటింటి సర్వే..
డాక్టర్ దివ్యాసింగ్ ముంబయికి వచ్చి, స్వచ్ఛందంగా పని చేయడానికి ముందుకు వచ్చిన పదిమంది డాక్టర్లతో ఒక బృందాన్ని తయారు చేసుకున్నారు. ఇంటింటికీ తిరిగి కరోనాను దారి తీసే ఫ్లూ వంటి లక్షణాలున్నాలు ఎవరిలోనైనా ఉన్నాయేమోననే సమాచారాన్ని సేకరిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వారు గడిచిన నెల రోజుల్లో ప్రయాణించిన ట్రావెల్ హిస్టరీని నమోదు చేసి, టెంపరరీ ఫీవర్ క్లినిక్లకు పంపించడంతోపాటు అక్కడ వారందరికీ ప్రాథమిక కరోనా పరీక్ష (స్వాబ్)లు చేయించి చికిత్స కోసం పంపిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో తన మెడికల్ టీమ్ బాగా సహకరిస్తోందని చెప్తున్నారు డాక్టర్ దివ్యాసింగ్.
రుణమిలా తీరింది..
ఇంతవరకు చెప్పుకున్న దివ్యాసింగ్ చొరవ నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు... ఆమె పీపీఈ కిట్ ధరించడానికి అడ్డుగా ఉందని తన పొడవాటి జుట్టును కత్తిరించేసుకున్నారు. ఆ జుట్టును క్యాన్సర్ పేషెంట్ల కోసం విగ్గులు తయారు చేసి సంస్థలకు విరాళంగా ఇచ్చారు. ఇండియాలోని కరోనా పేషెంట్లకు సేవ చేయడానికి వస్తున్నట్లు దివ్యాసింగ్ తన తల్లిదండ్రులకు చెప్పగానే వాళ్లు మొదట ఆందోళనకు లోనయ్యారు. ఆమె కరోనా సర్వే కోసం ఇంటింటికీ వెళ్లడం కూడా తల్లిదండ్రులను భయపెట్టింది. అయితే దివ్యాసింగ్ మాత్రం ‘‘నన్ను డాక్టర్ని చేసింది మనదేశం. నేను చదివిని సంస్థ నిర్మాణంలో భారతీయులు కట్టిన పన్నులు ఉన్నాయి. వారి స్వేదం ఉంది. వారి రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది’’ అని తల్లిదండ్రులను సమాధానపరిచారు. భారతదేశంలో పుట్టి, భారతదేశంలోని విద్యాసంస్థల్లో చదువుకుని, ఈ దేశంలో ఉండడం లాభదాయకం కాదంటూ డబ్బు సంపాదన కోసం విదేశాల బాట పడుతున్న వాళ్లనే చూస్తున్నాం. అలాంటి వారి మధ్య దివ్యాసింగ్ వంటి వాళ్లు ఎక్కడో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరికి దేశం ఎప్పుడూ ప్రణమిల్లుతూనే ఉంటుంది.
పేషెంట్లు ఉన్నారు డాక్టర్లు లేరు..
డాక్టర్ దివ్యాసింగ్ మెడిసిన్ పూర్తికాగానే భర్తతో పాటు ఆఫ్రికాకు వెళ్లిపోయారు. ఆమె భర్త ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి. ఆమె ఆఫ్రికాకు వెళ్లిన మూడు నెలలకే కరోనా విలయతాండవం మొదలైంది. మనదేశంలో అవసరమైనంత మంది వైద్యులు లేరు. ఇక్కడ కోట్లాదిమంది ఆందోళనలో రోజులు గడుపుతుంటే తనకు ఏ మాత్రం పట్టనట్లు ఆఫ్రికాలో ఉండిపోవడానికి ఆమె మనస్సు అంగీకరించలేదు. మార్చి మొదటి వారంలోనే (అప్పటికి ఇంకా లాక్డౌన్ ప్రకటించలేదు, విదేశీ విమానాలు ఆగిపోలేదు) ప్రమాదాన్ని అంచనా వేసి ఇండియాకి వచ్చేశారు. ముంబయిలోని వర్లి, ధారవి ప్రదేశాల మీద దృష్టి పెట్టారు.
ఇంటింటి సర్వే..
డాక్టర్ దివ్యాసింగ్ ముంబయికి వచ్చి, స్వచ్ఛందంగా పని చేయడానికి ముందుకు వచ్చిన పదిమంది డాక్టర్లతో ఒక బృందాన్ని తయారు చేసుకున్నారు. ఇంటింటికీ తిరిగి కరోనాను దారి తీసే ఫ్లూ వంటి లక్షణాలున్నాలు ఎవరిలోనైనా ఉన్నాయేమోననే సమాచారాన్ని సేకరిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వారు గడిచిన నెల రోజుల్లో ప్రయాణించిన ట్రావెల్ హిస్టరీని నమోదు చేసి, టెంపరరీ ఫీవర్ క్లినిక్లకు పంపించడంతోపాటు అక్కడ వారందరికీ ప్రాథమిక కరోనా పరీక్ష (స్వాబ్)లు చేయించి చికిత్స కోసం పంపిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో తన మెడికల్ టీమ్ బాగా సహకరిస్తోందని చెప్తున్నారు డాక్టర్ దివ్యాసింగ్.
రుణమిలా తీరింది..
ఇంతవరకు చెప్పుకున్న దివ్యాసింగ్ చొరవ నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు... ఆమె పీపీఈ కిట్ ధరించడానికి అడ్డుగా ఉందని తన పొడవాటి జుట్టును కత్తిరించేసుకున్నారు. ఆ జుట్టును క్యాన్సర్ పేషెంట్ల కోసం విగ్గులు తయారు చేసి సంస్థలకు విరాళంగా ఇచ్చారు. ఇండియాలోని కరోనా పేషెంట్లకు సేవ చేయడానికి వస్తున్నట్లు దివ్యాసింగ్ తన తల్లిదండ్రులకు చెప్పగానే వాళ్లు మొదట ఆందోళనకు లోనయ్యారు. ఆమె కరోనా సర్వే కోసం ఇంటింటికీ వెళ్లడం కూడా తల్లిదండ్రులను భయపెట్టింది. అయితే దివ్యాసింగ్ మాత్రం ‘‘నన్ను డాక్టర్ని చేసింది మనదేశం. నేను చదివిని సంస్థ నిర్మాణంలో భారతీయులు కట్టిన పన్నులు ఉన్నాయి. వారి స్వేదం ఉంది. వారి రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది’’ అని తల్లిదండ్రులను సమాధానపరిచారు. భారతదేశంలో పుట్టి, భారతదేశంలోని విద్యాసంస్థల్లో చదువుకుని, ఈ దేశంలో ఉండడం లాభదాయకం కాదంటూ డబ్బు సంపాదన కోసం విదేశాల బాట పడుతున్న వాళ్లనే చూస్తున్నాం. అలాంటి వారి మధ్య దివ్యాసింగ్ వంటి వాళ్లు ఎక్కడో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరికి దేశం ఎప్పుడూ ప్రణమిల్లుతూనే ఉంటుంది.
Published date : 18 May 2020 04:08PM