Skip to main content

‘మెడికల్ పీజీ’ ఫీజుల పెంపుపై హైకోర్టులో పిటిషన్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ ఎయిడెడ్, నాన్ మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ మెడికల్ కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14న జారీ చేసిన జీవో 20పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ 121 మంది వైద్య విద్యార్థులు పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఈ పిటిషన్‌ను జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం విచారణ జరపడంపై టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ మరో ధర్మాసనానికి వెళ్లినట్లు తెలిసింది.
Published date : 16 May 2020 04:08PM

Photo Stories