ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
Sakshi Education
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను మే 18న విడుదల చేసింది.

విద్యార్థులు తమ మార్కుల రీటోటలింగ్ కోసం సబ్జెక్టుకు రూ.2వేలు చెల్లించి మే 30వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మేజర్ భీమేశ్వర్ తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్ (http://ntruhs.ap.nic.in) లో పొందవచ్చు.
Published date : 19 May 2020 03:14PM