TCS work from home: టీసీఎస్ను వీడుతున్న ఉద్యోగులు... కారణం ఏంటంటే

ఇంటి నుంచి పనిచేసే విధానానికి ముగింపు పలకడం ఇందుకు కారణం కావొచ్చన్నారు. టీసీఎస్ మొత్తం ఉద్యోగుల్లో 35 శాతం (6 లక్షల మందికి పైగా) మహిళలే కావడం గమనార్హం.
TCS warns employees: ఆఫీస్కు రాకుంటే ఉద్యోగం గోవిందా... ఉద్యోగులకు టీసీఎస్ తీవ్ర హెచ్చరిక..!

‘‘కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కారణంగా కొంత మంది మహిళలకు ఇంటి ఏర్పాట్ల విషయంలో మార్పులకు దారితీసి ఉండొచ్చు. ఇదే వారిని తిరిగి కార్యాలయాలకు రానీయకుండా చేయవచ్చు’’అని మిలింద్ లక్కడ్ కంపెనీ వార్షిక నివేదికలో అభిప్రాయపడ్డారు. లింగ వైవిధ్యం కోసం కృషి చేస్తున్న కంపెనీకి పెరిగిన మహిళల అట్రిషన్ రేటు ప్రతికూలమన్నారు. దీన్ని తగ్గించడంపై కంపెనీ దృష్టి పెడుతుందన్నారు. మార్చి నాటికి టీసీఎస్లో మొత్తం మీద అట్రిషన్ రేటు 20 శాతం స్థాయిలో ఉండడం గమనార్హం.
చదవండి: ఐటీ బుడగ పేలనుందా... సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి.?

రాజేజ్ గోపీనాథన్కు రూ.29 కోట్లు
టీసీఎస్ సంస్థ 2022–23 సంవత్సరానికి గాను సీఈవో స్థానంలో ఉన్న రాజేష్ గోపీనాథన్కు రూ.29.16 కోట్ల పారితోషికాన్ని చెల్లించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 13.17 శాతం ఎక్కువ. ఆరేళ్లుగా టీసీఎస్ను నడిపించిన గోపీనాథన్ ఇటీవలే సీఈవోగా వైదొలగగా కే.కృతివాసన్ ఈ బాధ్యతల్లోకి రావడం తెలిసిందే.
చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగంపై ఆందోళన వద్దు... ఇలా చేస్తే మీ ఉద్యోగం గ్యారంటీ

కొత్త సీఈవో కృతివాసన్కు ప్రతి నెలా రూ.10 లక్షలు బేసిక్ వేతనంగా కంపెనీ చెల్లించనుంది. ఇది రూ.16 లక్షల వరకు పెరుగుతూ వెళుతుంది. బోర్డు నిర్ణయించిన మేరకు కమీషన్, అద్దెలేని నివాస వసతి తదితర సదుపాయాలు కల్పించనున్నారు. ఇక కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణియమ్ గత ఆర్థిక సంవత్సరానికి రూ.23.60 కోట్ల పారితోషికాన్ని (13.58 శాతం అధికం) పొందారు.
చదవండి: లక్షల జీతం ఏం చేసుకోను...మనశ్శాంతే లేదు... ఐటీ ఉద్యోగుల ఆవేదన..!