Skip to main content

Job Mela: రేపు ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా.. అర్హులు వీరే..

Job Mela

మొగ‌ల్రాజ‌పురం(విజ‌య‌వాడ తూర్పు): ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని నిరుద్యోగ యువ‌త‌కు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు ఈ నెల 22వ తేదీన(గురువారం) జాబ్‌మేళా జ‌రుగుతుంద‌ని జిల్లా ఉపాధి ఆధికారి విక్ట‌ర్‌బాబు ఆగ‌స్టు 20వ తేదీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజ‌య‌వాడ‌లోని ప్ర‌భుత్వ ఐటీఐ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఈ జాబ్‌మేళా జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. 

జీనియ‌స్, ఎస్ఐఎస్ లిమిటెడ్‌, డీ మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌, విజేత మొద‌లైన కంపెనీల ప్ర‌తినిధులు హాజ‌రై త‌మ కంపెనీల్లో ఉద్యోగాల భ‌ర్తీకి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తార‌ని వివ‌రించారు. ప‌ద‌వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 30 సంవ‌త్స‌రాలలోపు వ‌య‌సు వారు జాబ్‌మేళాలో పాల్గొన‌డానికి అర్హుల‌ని తెలిపారు. 

ఆస‌క్తి, అర్హ‌త ఉన్న వారు ఒరిజిన‌ల్ విద్యార్హ‌త స‌ర్టిఫికెట్ల‌తో పాటుగా వాటి జిరాక్స్ కాపీలు, బ‌యోడేటా, ఆధార్‌కార్డుతో జాబ్‌మేళాకు నేరుగా హాజ‌రు కావాల‌ని సూచించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 81424 16211 (వాట్స‌ప్ కాల్‌లో) సంప్ర‌దించాల‌ని కోరారు.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈనెల 22న జాబ్‌మేళా

Published date : 21 Aug 2024 04:12PM

Photo Stories