Job Fair: మార్చి 20న జాబ్ మేళా... ఎవరెవరు అర్హులంటే..
Sakshi Education
నిరుద్యోగులకు శుభవార్త. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ కంప్లీట్ చేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. మార్చి 20వ తేదీ హైదరాబాద్ నగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు.
దాదాపు 16 కంపెనీలు మేళాలో పాల్గొననున్నాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు మేళ జరగనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హతలు తెలిపే సర్టిఫికెట్లతో రావాల్సి ఉంటుంది. ఇందులో ఎంపికైన వారికి సోలార్, ఎలక్రికల్ వెహికల్స్(ఈవీ) కంపెనీలలో పని చేయాల్సి ఉంటుంది. 30 ఏళ్ల లోపు అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరుకావొచ్చు. మరిన్ని వివరాలకు 7893646089, 9330280381 నంబర్లలో సంప్రదించవచ్చు.
Published date : 17 Mar 2023 07:05PM