CM YS Jagan : సీఎం సంచలన నిర్ణయం..వీళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశం
Sakshi Education
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కోవిడ్తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ అక్టోబర్ 18వ తేదీన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, విలేజ్ అర్బన్ హెల్త్ ఏర్పాటుపై సీఎం సమీక్షిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది నియామకం, కోవిడ్ వాక్సినేషన్ తదితర అంశాలపై చర్చిస్తున్నారు.
Published date : 18 Oct 2021 06:22PM