AP Contract Employees : ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు.. మరో ఏడాదికి పొడగింపు..

సాక్షి ఎడ్యుకేషన్: ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్కార్ తీపి కబురు.. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, జిల్లాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. వారి ఉద్యోగ కాలం గత నెల 31వ తేదీతోనే ముగియగా, వారి గడువును పెంచి శుభవార్తను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
ఉద్యోగులను ఇప్పుడే తొలగించకుండా, మరో ఏడాది కాలం పాటు కొనసాగేలా చర్యలు చేపట్టి వారి కాంట్రాక్ట్ సమయాన్ని మరింత పొడగిస్తూ, కీలక ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
ఆర్థిక శాఖ కీలక ప్రకటన
ఈ నేపథ్యంలో, వారి సర్వీసులను వచ్చే ఏడాది.. 2026 మార్చి 30వ తేదీ వరకు పొడగించి, ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేశారు.
కానీ, ఈ వార్త కేవలం రాష్ట్ర ఆర్థక శాఖ అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది సర్కార్. కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకానికి ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి అని కూడా స్పష్టం చేసింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)