Skip to main content

Infosys Layoffs : వ‌రుస‌గా నాలుగో సారి ఇన్ఫోసిస్ ట్రైనీ ఉద్యోగుల తొలగింపు.. వీరికి వివిధ కోర్సుల్లో శిక్ష‌ణ‌..

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నుంచి తాజా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇక్క‌డ ప‌ని చేస్తున్న‌ ట్రైనీ ఉద్యోగుల‌ను తొలగించే చ‌ర్య‌లు కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది.
Fourth time layoffs of trainee employees at infosys

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నుంచి తాజా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇక్క‌డ ప‌ని చేస్తున్న‌ ట్రైనీ ఉద్యోగుల‌ను తొలగించే చ‌ర్య‌లు కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. 2025వ సంవ‌త్స‌రంలో ట్రైనీలను తొలగించే చ‌ర్య‌లు చేపట్టడం  ఇది నాలుగోసారి జ‌రుగుతోంది. తుది ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో విఫలమైన కారణంగా మరో 195 మందిని పక్కన పెట్టింది ఇన్ఫోసిస్‌. వారందిరికీ, వారి ఇ-మెయిల్‌కు ఇన్ఫోసిస్ అధికారులు సమాచారం ఇచ్చినట్లు ఆంగ్ల మీడియా సంస్థ‌ల నుంచి అందుతున్న స‌మాచారం. 

సంస్థ నుంచి తొలింపు మెయిల్‌లు అందుకున్న 800 మంది ఉద్యోగుల‌కు ఇన్ఫోసిస్ స్వ‌యంగా ఎన్ఐఐటీ, అప్‌గ్రేడ్ నుంచి వివిధ కోర్సుల్లో శిక్ష‌ణ అందిస్తుండ‌గా.. అందులో 250 మంది ఈ కోర్సుల అవ‌కాశాన్ని వినియోగించుకున్నార‌ని, మ‌రో 150 మంది ఆ సంస్థ అందిస్తున్న ఔట్ ప్లేస్మెంట్‌ల కోసం ద‌ర‌ఖాస్తులు చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. 

బ్రేకింగ్ న్యూస్‌: డిఎస్సీ 2025 దరఖాస్తుదారులకు శుభవార్త!

ఏప్రిల్‌లో 240 మంది తొల‌గింపు..

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వ‌రుస‌గా 4 సార్లు తొల‌గింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇన్ఫోసిస్‌ తొలుత ఫిబ్రవరి నెలలో 300 మంది, మార్చిలో 30-35 మందిని, ఏప్రిల్‌లో 240 మందిని తొలగించింది. తొలగించిన ట్రైనీలకు ఒక నెల ఎక్స్‌గ్రేషియాతో పాటు రిలీవింగ్‌ లెటర్‌ను కూడా ఇస్తుంది. ప్రస్తుతం బ‌య‌ట‌కు వెళ్లిన‌ ట్రైనీలు 2022లో ఇన్ఫోసిస్‌ నియమించిన వారు. వీరిని 2024 అక్టోబర్‌లో ఆన్‌బోర్డ్‌ చేసుకున్నట్లు ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ పేర్కొంది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌ 15 వేల మంది ట్రైనీలను నియమించుకుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 29 Apr 2025 04:15PM

Photo Stories